చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను ఏకి పారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా తన గురించి బాడీ షేమింగ్ చేయాడన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. ఆ విషయం సీఎం గమనించాలని హితవు పలికారు. తాను ఏనాడూ పదవులు కోరుకోలేదని అన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. ఆనాడు ఎమర్జెన్సీ సమయంలో MISA చట్టం కింద జైలుకు వెళ్లానని తనకు గెలుపు ఓటములు లెక్క కాదన్నారు.
అప్పుడు జైలుకు వెళ్లిన డీఎంకే నేతలను చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసల వల్లే నాకు దవడ పగిలింది. శరీరం అంతా గాయాలయ్యాయని తెలిపారు ఎంకే స్టాలిన్. నన్ను బాడీ షేమింగ్ చేసిన పర్వాలేదు. ముందు ప్రజలను పట్టించుకో అని ఎద్దేవా చేశారు. ముందు రీల్స్, ఫొటోషూట్లు ఆపి.. రైతు రుణమాఫీ, నీవు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చు అని అన్నారు . ఎవరెంత అవమానించడానికి ప్రయత్నించినా.. చరిత్రను మార్చలేరని స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది గుర్తు పెట్టుకో అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి.





