కోటి మంది కార్య‌క‌ర్త‌ల బ‌లం ‘తెలుగుదేశం’

అమ‌రావ‌తి : కార్యకర్తలంతా నా తెలుగుదేశం, నా బాధ్యత అనే నినాదానికి కట్టుబడి ఉండాలి. జిల్లా నుంచి పార్లమెంటు వ్యవస్థ తేవడానికి మూడు పొలిట్ బ్యూరో సమావేశాలు పట్టింది. పార్టీలో మార్పు రావాలి, యువరక్తం రావాలని పోరాడాన‌ని అన్నారు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్. మనది కోటి 6లక్షల సభ్యులున్న అతిపెద్ద కుటుంబం. చిన్నచిన్న సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుందాం. ఏదేని అంశంపై పార్టీ నిర్ణయం తీసుకున్నాక జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనాలి. పాదయాత్ర చేసినపుడు కార్యకర్తలు కలిశారు. పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలన్నారు. అందుకే మై టిడిపి యాప్ తెచ్చాం. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు చేసిన నామినేటెడ్ పోస్టులు వెదుక్కుంటూ వస్తాయి. ప్రతి వ్యక్తి యాక్టివిటీని చంద్రబాబు చూస్తున్నారు. ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో 45రో జుల్లో కోటి 10లక్షల గడపలు కార్యకర్తలు తొక్కారు. ఒకరోజు 47 వేల మంది పాల్గొన్నారు. అదే మనందరికీ శ్రీరామరక్ష. కార్యకర్తలు నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని గుర్తించే బాధ్యత నాది

కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి, వారితో మమేకం కావాలి. వారితో అనుబంధం చాలా ముఖ్యం. ప్రజలతో బంధం ఏర్పడటం వల్లే మంగళగిరి ప్రజలు నన్ను 91వేల మెజారిటీతో గెలిపించారు. కార్యకర్తలంతా ప్రజలతో అనుసంధానం అవ్వండి. ప్రజలకు దగ్గర కావాల్సిన అవసరం ఉంది. క్లస్టర్, యూనిట్ పని చేయక పోతే దండం పెట్టి మార్చుకుంటాం. డోర్ టు డోర్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 8వేల బూత్ లలో ఇన్చార్జిలు తిరగలేదు. 75 ఏళ్ల వయసులో బాబు తిరుగుతుంటే మనం వెళ్లకపోతే ఎలా? పార్టీ కార్యకర్తలంతా సీరియస్ గా తీసుకొని పనిచేయండి. ఏ కార్యక్రమం చేసినా మన టిడిపి యాప్ ద్వారా తెలియ జేయండి. కోటి 6 లక్షలకు తోడు మనకు జనసేన, బిజెపి కూడా ఉన్నాయి. నోక్రాస్ ఫైర్, మిస్ ఫైర్, విడాకులు ఉండవు. పార్టీ అధినేతలుగా మాకు ఎలాంటి డౌట్లు లేవు. డౌట్ వస్తే నేను పవనన్నకు నేరుగా ఫోన్ చేస్తా. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించు కోవాలన్నారు.

  • Related Posts

    డిఎస్సీ అంటే జగన్ మోహ‌న్ రెడ్డికి జెల‌సీ : లోకేష్

    నెల్లూరు జిల్లా : రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. డిఎస్సీకి, ఎపిపిఎస్సీ కి తేడా తెలియని వ్యక్తి నన్ను ప్రశ్నిస్తున్నారు. దేశ చరిత్రలో అనేక మంది…

    19న 3 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ

    హైద‌రాబాద్ : రాష్ట్రంలో వ‌ర్షాలు భారీగా కురిసే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని వర్షాలు కురుస్తాయ‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం సెప్టెంబర్ 19న ములుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *