చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను ప్రశంసించాడు డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్. ఆయన విజయ్ సేతుపతిపై పరోక్ష విమర్శలు చేశాడు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘బత్తా’ (Baththa) చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అట్లీ మాట్లాడారు. ఎవరైనా ఒక వ్యక్తిని లేదా ఒక అంశాన్ని ప్రస్తావించాలనుకుంటే, పరోక్ష సంకేతాల ద్వారా కాకుండా బహిరంగంగానే మాట్లాడవచ్చని ఆయన అన్నారు. మనం ‘జెన్ జెడ్’ (Gen Z) తరానికి చెందిన వాళ్ళం, మనం తర్వాతి తరానికి విషయాలను తెలియ జేయాలి. సోషల్ మీడియాలో ఒకరు మరొకరిని ఉద్దేశించి మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తుంది కానీ, వాస్తవానికి అలాంటిదేమీ ఉండదు. ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా చెప్పవచ్చు, ముఖాముఖిగా చర్చించు కోవచ్చు. జీవితం మిమ్మల్ని మీరు కోరుకున్న గమ్యానికి చేరుస్తుంది. ఎవరి మాటలూ వినకండి, అనవసరమైన ఉచ్చుల్లో పడకండి అని ఆయన అన్నారు.
చాలా మంది తాము రాజకీయాలకు అతీతమని చెప్పుకున్నప్పటికీ, రాజకీయాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగమేనని అట్లీ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలను ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మనం స్పష్టంగా, నిజాయితీగా ఉండాలి. చాలా మంది తమకు రాజకీయాలతో సంబంధం లేదని చెబుతుంటారు. కానీ ఒకప్పుడు నేను కూడా శాసనసభ సమావేశాలను చూసేవాడిని కాదని చెప్పేవాడిని, ఇప్పుడు ఐదేళ్ల పిల్లలు కూడా వాటిని చూస్తున్నారని నాకు తెలుసు. కాబట్టి, సీఎం విజయ్ ఒక బలమైన తరాన్ని తీర్చిదిద్దుతున్నారని నేను భావిస్తున్నాను. రాజకీయాలు మన కోసమే; వాటిని మనం ఎలా అన్వయించు కోవాలి, వాటితో ఏం చేయగలమనేది మనం ఆలోచించాలి అని ఆయన అన్నారు.





