ప్రకటించిన భారత ఎన్నికల సంఘం
హైదరాబాద్ : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం పరిశీలకులను నియమించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేరకు అధికారికంగా మంగళవారం ప్రకటించింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణను నిస్పాక్షికంగా, పారదర్శకంగా, శాంతియుతంగా జరపడానికి ఎన్నికల సంఘం ముగ్గురు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించింది . ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ (ఖర్చు ) పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్ లను నియమించింది.
ఈ అధికారులు ఎన్నికల ప్రక్రియలో సాధారణ పర్యవేక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, పార్టీలు, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వంటి అంశాలను పర్యవేక్షిస్తారు . ఈ పరిశీలకులు ఎన్నికల నిబంధనల అమలు, శాంతి భద్రతలు, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలిస్తారని, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తారని వెల్లడించింది ఎన్నికల సంఘం. కాగా ఉప ఎన్నిక పూర్తి అయ్యేంత వరకూ వీరు అందుబాటులో ఉంటారని స్పష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన లు, శాంతి భద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిశీలకులకు తెలియ చేయాలని కోరింది.






