సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ష‌మీ భార్య

Spread the love

త‌న‌కు రూ. 10 ల‌క్ష‌లకు పైగా భ‌రణం పెంచాలి

ఢిల్లీ : ప్ర‌ముఖ క్రికెట‌ర్ , స్టార్ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీ భార్య హ‌సిన్ జ‌హాన్ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. ఇప్ప‌టికే కోర్టు ఈ ఇద్ద‌రికి విడాకులు మంజూరు చేసింది. తుది తీర్పు వెలువ‌రించింది. అంతే కాకుండా ష‌మీ ప్ర‌తి నెలా త‌న‌కు భ‌ర‌ణం ఇవ్వాల‌ని ఆదేశించింది. అయితే మ‌రోసారి ర‌చ్చ‌కు ఎక్కింది మాజీ భార్య‌. త‌న‌కు రూ. 10 ల‌క్ష‌ల‌కు పైగా భ‌ర‌ణం పెంచాల‌ని కోరింది. ఈ మేర‌కు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై భార‌త క్రికెట‌ర్ ష‌మీ, ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం స్పంద‌న కోరింది.

విచార‌ణ సంద‌ర్బంగా మధ్యంతర ప్రాతిపదికన భరణం కోసం, షమీస్ భార్య, కుమార్తెకు కలకత్తా హైకోర్టు ఆదేశించిన అవార్డు న్యాయ‌బ‌ద్దంగానే ఉంద‌ని పేర్కొంది. ధ‌ర్మాస‌నం కీల‌క సూచ‌న‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా మహ్మద్ షమీ తన విడిపోయిన భార్య హసిన్ జహాన్ , కుమార్తెకు నెలవారీ భరణం రూ.4 లక్షల భరణం చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. జహాన్‌కు నెలకు రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉండగా, కుమార్తెకు నెలకు రూ.2.50 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కలకత్తా హైకోర్టు భరణంపై ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేసింది . గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005లోని సెక్షన్ 20 ప్రకారం, ద్రవ్య ఉపశమనం తగినంతగా, న్యాయంగా, సహేతుకంగా , వైవాహిక జీవనశైలికి అనుగుణంగా ఉండాలని త‌ను పిటిష‌న్ లో కోరింది.

  • Related Posts

    త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లోనే మ్యాచ్ లు ఆడుతాం

    Spread the love

    Spread the loveఐసీసీకి స్ప‌ష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా తాము ఇండియాలో జ‌రిగే కీల‌క మ్యాచ్ ల‌ను…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 బ‌రువు 6,175 కిలోలు

    Spread the love

    Spread the love18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ త‌యారీ న్యూఢిల్లీ : అమెరికా వేదిక‌గా ఈ ఏడాది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్స‌ర్ చేస్తోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *