డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారికి దూరంగా ఉండాలి

పిలుపునిచ్చిన మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్

హైద‌రాబాద్ : డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారికి దూరంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్. మాద‌క‌ద్ర‌వ్యాల బారిన ప‌డి యువ‌త విలువైన జీవితాన్ని కోల్పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో డ్ర‌గ్స్, మాద‌క ద‌వ్యాల బారిన ప‌డ‌కుండా క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించామ‌ని, ఇందులో భాగంగానే ఈగ‌ల్ టీంను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు మంత్రి. డ్ర‌గ్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాల గురించి స్కూల్స్, పాఠ‌శాల‌లు, విశ్వ విద్యాల‌యాల‌లో విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. డ్ర‌గ్స్ ర‌హిత తెలంగాణ రాష్ట్రంగా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్.

ఈ కార్యక్రమంలో ఉమెన్, చైల్డ్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీజీ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సీనియర్ సిటిజన్ , ట్రాన్స్‌జెండర్ విభాగం డైరెక్టర్ శైలజ, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ శ్రీకాంత్, గాంధీ హాస్పిటల్ సూపరిండెంటెంట్ డాక్టర్ వాణి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *