దేశానికి స్పూర్తి ఇందిర జీవితం : ష‌ర్మిలా రెడ్డి

Spread the love

యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచిన నేత‌

విజ‌య‌వాడ : యావ‌త్ భార‌త జాతికి స్పూర్తి దాయకంగా దివంగ‌త తొలి మ‌హిళా ప్ర‌ధాని ఇందిరాగాంధీ అని అన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైస్ ష‌ర్మిలా రెడ్డి. ధైర్య సాహసాలకు, భారతీయ మహిళా శక్తికి ప్రతీక, ఉక్కు మహిళ, భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని చల్లపల్లి బంగ్లా వద్ద మహనీయురాలి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. . జమిందారీ వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, హరిత విప్లవం, భూ సంస్కరణలు, అణుశక్తి అభివృద్ధి, మహిళా సాధికారిత లాంటి ఇందిరా గాంధీ కీలక సంస్కరణలు దేశ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచాయ‌ని అన్నారు.

ఆమె ఇవాళ మ‌నంద‌రి మ‌ధ్య భౌతికంగా లేక పోవ‌చ్చు. కానీ ఇందిరా గాంధీ సాధించిన విజ‌య‌వాలు, నాయ‌క‌త్వ నైపుణ్యం, ప్ర‌త్యేకించి దేశం కోసం తాను తీసుకున్న అసాధార‌ణ నిర్ణ‌యాలు ఎల్ల‌ప్ప‌టికీ గుర్తుండి పోతాయ‌న్నారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఇందిర , విజ‌యేందిర బ‌తికే ఉంటుంద‌ని, కోట్లాది గుండెల్లో గూడు కట్టుకుని నిలిచి ఉంటుంద‌న్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. గాంధీ కుటుంబం ఈ దేశం బ‌లై పోయార‌ని, సిక్కుల కాల్పుల్లో త‌ను నేల‌కొరిగార‌ని, నేటికీ ఇందిర అంటేనే ఇండియా అని దానిని కాద‌నే హ‌క్కు ఎవ‌రికీ లేద‌న్నారు .

  • Related Posts

    డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

    Spread the love

    Spread the loveమే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​…

    రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

    Spread the love

    Spread the loveఇళ్ళలోకి చొచ్చుకొచ్చి నానా బీభత్సం రాజ‌స్థాన్ : ఇసుక తుపాను దెబ్బ‌కు రాజస్థాన్ విల విల లాడింది. రాజ‌స్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *