స‌చివాల‌య ఉద్యోగుల‌కు ఆరోగ్యం ముఖ్యం

Spread the love

ప్రారంభించిన మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహా

హైద‌రాబాద్ : ఉద్యోగుల‌కు విధుల‌తో పాటు ఆరోగ్యం కూడా ముఖ్య‌మేన‌ని అన్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహా. బుధ‌వారం హైదరాబాద్ లోని డా. B R అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని మూడో అంతస్థులో సెక్రటేరియట్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రేనోవా హాస్పిటల్స్ అద్వర్యం లో ఏర్పాటు చేసిన AI Based మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపు ను ప్రారంభించారు.

ఈ హెల్త్ క్యాంపు లో సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆద్వర్వం లో వచ్చిన ఉద్యోగులకు రేనోవా హాస్పిటల్ అద్వర్యం లో వచ్చిన వైద్య సిబ్బంది అత్యాధునిక ఎక్విప్ మెంట్ సాయం తో BP , GRBS , ECG , 2D Echo పరీక్షలను నిర్వహించారు . కార్డియాలజీ , జనరల్ ఫీజిషన్ సేవలను free కన్సల్టేషన్ సేవలను ఉద్యోగులకు అందించారు .

ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడారు..మారుతున్న జీవన శైలిలలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలన్నారు . ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంద‌న్నారు. సచివాలయ ఉద్యోగులకు హెల్త్ క్యాంపు పెట్టి వైద్య సేవలను , పరీక్షలను ఉచితంగా అందించిన రేనోవా ఆసుపత్రి వైద్య సిబ్బంది ని మంత్రి దామోదర్ రాజనర్సింహా అభినందించారు.

  • Related Posts

    ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రిక

    Spread the love

    Spread the loveరానున్న రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు అమ‌రావ‌తి : ఏపీకి రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రానున్న రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ…

    సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : సింగ‌రేణి సంస్థ‌ను కాపాడుకునేందుకు ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి , హెచ్ఎంఎస్ అధ్యర్యంలో నిర్వహించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *