స‌క్కుబాయి లేఔట్‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా విచార‌ణ‌

Spread the love

సంబంధిత ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలన్న హైడ్రా క‌మిష‌న‌ర్‌
హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం లోని షేక్‌పేట విలేజ్‌లోని స‌క్కుబాయి లే ఔట్‌లో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా విచార‌ణ చేప‌ట్టింది. స‌ర్వేనంబ‌రు 327లో 25 ఎక‌రాల ప‌రిధిలో స‌క్కుబాయి న‌గ‌ర్ మ్యూచ్చ్యువ‌ల్లీ ఎయిడెడ్ కోప‌రేటివ్ సొసైటీ పేరుతో లే ఔట్ వేశారు. ఇక్క‌డ పార్కును కాపాడాలంటూ హైడ్రా ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు క్షేత్ర స్థాయిలో విచారించిన హైడ్రా అధికారుల‌కు మ‌రిన్ని ఆక్ర‌మ‌ణ‌ల గురించి తెలిసింది. పార్కుతో పాటు.. శ్మ‌శాన వాటిక‌, చారిత్ర‌క బుల్కాపూర్ నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన‌ట్టు గుర్తించారు. దీంతో స‌ర్వే నంబ‌రు 327లో మిగిలి ఉన్న భూమికి సంబంధించిన అంశాల‌పై పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ భావించారు. ఇక్క‌డి ఖాళీ స్థ‌లాల‌పై సొసైటీకి చెందిన వారితో పాటు, షేక్‌పేట విలేజ్ ప్ర‌తినిధులతో హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ స‌మావేశ‌మ‌య్యారు.

ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్నారు. సంబంధిత ప‌త్రాల‌ను ప‌రిశీలించారు. స‌క్కుబాయి లే ఔట్ వేసిన భూమి ప్ర‌భుత్వానిద‌ని షేక్ పేట విలేజ్ ప్ర‌తినిధులు స‌దానందం, అశోక్ కుమార్ ఆరోపించారు. పార్కు స్థ‌లంగా పేర్కొంటున్న ప్రాంతాన్ని తాము ఆల‌య ఉత్స‌వాల‌కు వాడుకుంటున్నామ‌ని క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. శ్మ‌శానాన్ని కూడా వ‌ద‌ల‌కుండా సొసైటీ ప్ర‌తినిధులు క‌బ్జాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. సొసైటీ ప్ర‌తినిధులు కూడా ఆ భూమి త‌మ‌కు ఎలా వ‌చ్చిందో సొసైటీ సెక్ర‌ట‌రీ సీతారామ‌య్య వివ‌రించారు. అధికారిక లే ఔట్‌లోని పార్కును కాపాడాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో మ‌రింత లోతైన విచార‌ణ చేప‌ట్టాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశించారు. స‌బంధిత ప‌త్రాల‌న్నీ ప‌రిశీలించి.. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖ‌ల అధికారుల నుంచి పూర్తి వివ‌రాలు తెలుసు కోవాల‌ని హైడ్రా అదికారుల‌కు సూచించారు. ఇరు ప‌క్షాల‌కు చెందిన వారు కూడా పూర్తి వివ‌రాలు అంద‌జేయాల‌ని.. త‌ర్వాత అన్ని శాఖ‌ల అధికారుల స‌మ‌క్షంలో స‌మావేశాన్ని ఏర్పాటు చేస్తామ‌ని క‌మిష‌న‌ర్ హామీ ఇచ్చారు.

  • Related Posts

    ఆరు నూరైనా పాల‌మూరును అభివృద్ది చేస్తా

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల‌మూరు జిల్లా : ఆరు నూరైనా పాల‌మూరును అభివృద్ది చేసి తీరుతానంటూ ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లి లో…

    బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీపీసీసీ నేత జ‌గ్గారెడ్డి హైద‌రాబాద్ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను బ‌తికి ఉన్నంత వ‌ర‌కు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నంటూ ప్ర‌క‌టించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *