క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును ప్రారంభించండి

Spread the love

సజన్ రాజ్ కురుప్ తో నారా లోకేష్ భేటీ

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ , స్కీన్ రైటర్ చిక్ రసెల్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నొవేషన్స్ లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది త‌మ లక్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా అమరావతిలో AI-ఆధారిత వర్చువల్ స్టూడియోలు, లీనమయ్యే AR/VR థీమ్ పార్కులు, ప్రపంచ సహ-ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటుచేసి అత్యాధునిక ట్రాన్స్‌మీడియా నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం అన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ –అమరావతిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, మా లక్ష్యసాధనకు మీ వంతు సహకారం అందించాలని కోరారు.

క్రియేటివ్ ల్యాండ్ వ్యవస్థాపకుడు సజన్ రాజ్ కురుప్ స్పందిస్తూ క్రియేటివ్ ల్యాండ్ సంస్థ ఏఐ ఆధారిత కళ, వర్చువల్ రియాలిటీ (విఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్), సృజనాత్మక సాంకేతికతల కోసం బ్లాక్ చెయిన్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. VFX, AI, గేమింగ్, యానిమేషన్ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడానికి అంకితమైన సంస్థ క్రియేటర్‌ ల్యాండ్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టు ఏర్పాటుకు గత ఏడాది ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాం అని తెలిపారు. ఆ ఎంవోయూ మేరకు 24 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామ‌ని తెలిపారు. అది పూర్తయితే రూ.10వేల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించడమేగాక, యువతకు 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం లభిస్తుందని చెప్పారు.

  • Related Posts

    అమ్మాన్ లో ప్ర‌ధాని మోదీకి ఘ‌న స్వాగ‌తం

    Spread the love

    Spread the loveసంతోషంగా ఉందంటూ పేర్కొన్న పీఎం అమ్మాన్ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న త‌న అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమ్మాన్ లో కాలు మోపారు. అక్క‌డ మోదీకి ఘ‌న స్వాగ‌తం…

    దాడుల‌కు పాల్ప‌డితే ఊరుకోం ఎదుర్కొంటాం

    Spread the love

    Spread the loveకాంగ్రెస్ శ్రేణుల‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ హైద‌రాబాద్ : స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్లుగా బీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున రెండో విడ‌త జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొందారు. దీంతో త‌ట్టుకోలేని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయ‌కులు దాడుల‌కు దిగ‌డం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *