ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు గ్రాండ్ వెల్ క‌మ్

స్వాగ‌తం ప‌లికిన జిల్లా క‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : తెలంగాణ పర్యటనలో ఉన్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపత్రావు పాటిల్ కలిశారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పూజలు చేసేందుకు మార్గమధ్యంలో మున్ననూర్ (అమ్రాబాద్ మండలం) లోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్‌ను సందర్శించారు. ఈ సంద‌ర్బంగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు ఉత్సవ పోలీసు గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. శ్రీ‌శైలంలో స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకున్నారు జ్ఞానేష్ కుమార్ కుటుంబ స‌మేతంగా.

అనంత‌రం ఎన్నిక‌ల ప్ర‌ధాన కమిషన‌ర్ స్వామి, అమ్మ వార్ల‌కు పూజ‌లు చేసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. త‌న జీవితంలో మ‌రిచి పోలేని అనుభూతి చెందాన‌ని చెప్పారు. సాక్షాత్తు ఆ ప‌ర‌మ శివుడు, శ్రీ భ్ర‌మ‌రాంబికా అమ్మ వారిని ద‌ర్శించు కుంటాన‌ని తాను క‌ల‌లో కూడా అనుకోలేద‌న్నారు. పూర్తిగా కొండ‌ల్లో ఆధ్యాత్మిక‌త‌కు ఆల‌వాలంగా శ్రీ‌శైలం పుణ్య క్షేత్రం ఉండ‌డం మ‌రింత ఆహ్లాదాన్ని, అంత‌కు మించిన సంతోషాన్ని తాము పొందామ‌ని చెప్పారు జ్ఞానేష్ కుమార్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *