డీటీఓ కిష‌న్ నాయ‌క్ ఆస్తుల విలువ రూ. 250 కోట్లు

Spread the love

ఏసీబీ వలకు చిక్కిన రవాణా శాఖ తిమింగలం

హైద‌రాబాద్ : ఏసీబీ దాడుల‌లో విస్తు పోయే నిజాలు బ‌య‌ట ప‌డ్డాయి. భారీ అవినీతి తిమింగ‌లం చిక్కింది. అధికారం ఉంది క‌దా అని అడ్డ‌గోలుగా సంపాదించిన ఓ అవినీతి జిల్లా స్థాయి అధికారి రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ‌డం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు కిష‌న్ నాయ‌క్. త‌ను హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో నివాసం ఉంటున్నాడు.

అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయన ఇంటితో పాటు, నిజామాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఉన్న తన బంధుమిత్రుల ఇళ్లతో కలిపి 12 చోట్ల తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ సోదాల‌లో బైర్లు క‌మ్మేలా విస్తు పోయేలా వాస్త‌వాలు బ‌య‌ట ప‌డ్డాయి. కిష‌న్ నాయ‌క్ కు నారాయణఖేడ్ ప్రాంతంలో 31 ఎకరాలు, నిజామాబాద్ ప్రాంతంలో 10 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ షాపుకు లీజుకు ఇచ్చిన 3000 గజాల వాణిజ్య స్థలం, కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో రూ.1.37 కోట్ల నగదు, అశోక్ టౌన్ షిప్‌లో రెండు ఫ్లాట్లు, 4000 గజాల స్థలంలో పాలి హౌస్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ఏసీబీ డీజీ చారుసిన్హా

కిషన్ నాయక్ బంధువుల ఇంట్లో దొరికిన ఆస్తి పత్రాలన్నీ స్వాధీనం చేసుకున్నామ‌ని, ఆయన ఆస్తులు రూ.250 కోట్లు ఉంటాయని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    గోవా యూనివ‌ర్శిటీలో కాంగ్రెస్ గోవా ఫార్వ‌ర్డ్ విక్ట‌రీ

    Spread the love

    Spread the loveరాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కంగ్రాట్స్ గోవా : గోవా రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల నుంచి ఎదుర‌వుతోంది. మొన్న‌టికి మొన్న రాష్ట్ర…

    ఏపీ స‌ర్కార్ సంక్రాంతి కానుక : స‌విత

    Spread the love

    Spread the loveఆప్కోలో భారీ డిస్కౌంట్ అమ్మ‌కాలు అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది వ‌స్త్ర కొనుగోలుదారుల‌కు. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ఆప్కో షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *