అలిపిరి మార్గంలో ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్

శ్రీ‌వారి భ‌క్తుల కోసం టీటీడీ ఏర్పాటు

తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను టీటీడీ ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల లోని అలిపిరి మెట్ల మార్గంలోని 7వ మైలు వ‌ద్ద ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్బంగా ఆదివారం టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఇదిలా ఉండ‌గా నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా, అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామ‌ని వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలకు తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను తప్పక వినియోగించు కోవాలని కోరారు. టీటీడీ, అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడిక్స్ బృందం, ఈసిజి యంత్రం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, నెబ్యులైజర్, అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యం కోసం శ్రీ‌వారికి విన్న‌పం

    తిరుమ‌ల : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటూ తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు త‌న భార్య అన్నా లెజ్ నోవా. ప‌వ‌న్ కు ఇటీవ‌లే ముంబైలో భుజానికి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. మూడు వారాల పాటు విశ్రాంతి…

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *