తిరుమ‌ల‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన మంత్రులు, చైర్మ‌న్

తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం ప్ర‌ముఖులు, సెలిబ్రిటీలు , ప్ర‌జా ప్ర‌తినిధులు పోటెత్తారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం తిరుమ‌ల‌కు చేరుకుంది. రేణిగుంట‌ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, వాణిజ్య, ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ , ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు గ్రాండ్ వెల్ కం చెప్పారు. భారీ భ‌ద్ర‌త మ‌ధ్య త‌ను రేణిగుంట నుంచి తిరుమ‌ల‌కు వెళ్లారు.

అక్క‌డ టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడుతో పాటు మంత్రులు స్వాగ‌తం ప‌లికారు. స్వామి వారి చిత్ర ప‌టాన్ని సీఎం రేవంత్ రెడ్డికి బహూక‌రించారు. త‌న కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల‌ను ద‌ర్శించు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని ఈ సంద‌ర్బంగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు బాగుండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. కొత్త ఏడాదిలో అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని ఆ దేవ దేవుడైన క‌లియుగ వైకుంఠ వాసుడిని ప్రార్థించాన‌ని తెలిపారు.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *