ఆశాభావం వ్యక్తం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా : నూతన సంవత్సరం సందర్బంగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తులపై సుంకాలు లేక పోవడంతో అమెరికా రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అంతటా కంపెనీలు ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో కర్మాగారాలు, వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నాయని ఆయన అన్నారు. 2026 సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన స్పందనను తెలిపారు. దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తులు ఎటువంటి సుంకాలను ఎదుర్కోక పోవడంతో కంపెనీలు ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో అమెరికా అంతటా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ సామాజిక వేదికగా స్పందించారు. భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు. ఒక దేశంలో పెట్టుబడులు పెట్టడంపై అమెరికా ప్రపంచ రికార్డును నెలకొల్పిందని పేర్కొన్నారు. తమ దేశం నెంబర్ వన్ గా ఉందని, డ్రాగన్ చైనాను తాము అధిగమించడం నూతన సంవత్సరం సందర్బంగా సంతోషంగా ఉందన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇక రెండవ స్థానంలో ఉన్న చైనా కంటే ట్రిలియన్ల డాలర్లు ఎక్కువ అని పేర్కొన్నారు. ఇది సుంకాలు , మీరు మీ ఉత్పత్తిని అమెరికాలో తయారు చేస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము తీసుకున్న నిర్ణయాల వల్లనే దేశ వ్యాప్తంగా కర్మాగారాలు, వ్యాపారాలు కొనసాగుతున్నాయని తెలిపారు.






