పిలుపునిచ్చిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట జిల్లా : రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ , జిల్లా పరిషత్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గులాబీ దుమ్ము రేపిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ప్రజలు ఇచ్చారని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. BRS సైనికులు మరింత ఉత్సాహంగా పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధించ వచ్చన్నారు. పురపాలిక ఎన్నికల్లో BRS అభ్యర్థుల జయకేతనం మోగించాలన్నారు జగదీశ్ రెడ్డి.
కారు గుర్తు కనిపిస్తే చాలు కాంగ్రేస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమన్నారు. కెసిఆర్ రుణం తెర్చుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారుని అన్నారు. ఆయన నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అంతా నమ్ముతున్నారని చెప్పారు మాజీ మంత్రి. గత ఎన్నికల్లో కాంగ్రస్ మాయ మాటలకు మోస పోయామని తెలుసుకున్నారని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్నిరంగాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ సర్కాదేనని పేర్కొన్నారు . ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రశ్నించాలన్నారు జగదీశ్ రెడ్డి.






