హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదుల వెల్లువ‌

Spread the love

క‌బ్జాదారుల నుండి కాపాడాల‌ని విన్న‌పం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో క‌బ్జాదారుల నుంచి విలువైన స్థ‌లాల‌ను కాపాడ‌ల‌ని హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి బాధితులు ఫిర్యాదు చేశారు. ప్ర‌తి వారం వారం ప్ర‌జా వాణి నిర్వ‌హిస్తోంది క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సారథ్యంలో . తాజాగా నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి 32 ఫిర్యాదులు అందాయి. రంగారెడ్డి జిల్లా స‌రూర్‌న‌గ‌ర్ మండ‌లం ఆర్‌కే పురం డివిజ‌న్‌లోని గ్రీన్‌హిల్స్ కాల‌నీలో 6087 గ‌జాల ఓపెన్‌స్పేస్ వ‌దిలిపెట్టారు. ఇప్ప‌టికే కొంత స్థ‌లం క‌బ్జాకు గుర‌య్యింద‌ని.. వెంట‌నే స‌ర్వే జ‌రిపించి రికార్డుల ప్ర‌కారం ఉన్న భూమిని కాపాడాల‌ని నివాసితులు కోరారు. అంతే కాకంఉడా త‌మ‌ కాల‌నీకి మంచి పార్కును నిర్మించాల‌ని విన్న‌వించారు.

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా నిజాంపేట స‌ర్కిల్ ప‌రిధిలోని చిల్డ్రెన్ పార్కు ద‌గ్గ‌ర‌లోని మురుగునీరు, వ‌ర‌ద‌నీటి కాలువ‌ను ఇష్టానుసారం మార్చేస్తున్నార‌ని వాపోయారు. గ‌తంలో ఎలా ప్ర‌వ‌హించేదో అలాగే ఉంచాల‌ని కౌశ‌ల్యా కాల‌నీ వాసులు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. రియ‌ల్ ఎస్టేట్ సామ్రాజ్యాల‌కు అనువుగా కాలువ‌ను తిప్పి వ‌ర‌ద సాఫీగా సాగేందుకు అవ‌కాశం లేకుండా మారుస్తున్నార‌ని ఆరోపించారు. . వెంట‌నే క‌లుగ చేసుకుని గ‌తంలో మాదిరి వ‌ర‌ద సాగేలా చూడాల‌ని కోరారు. ఐటీ హ‌బ్‌కు చేరువ‌లో అత్యంత విలువైన ఖాజాగూడ‌లో ఉన్న ఖాజాగూడ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని వెయ్యి గ‌జాల వ‌ర‌కూ క‌బ్జా చేసేశార‌ని హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదు చేశారు. దీనిని 250 గ‌జాల చొప్పున 4 ఫ్లాట్లుగా చేసి ఇంటి నంబ‌ర్లు కూడా తెచ్చుకున్నార‌ని తెలిపారు. వెంట‌నే హైడ్రా రంగంలోకి దిగి ఖాజాగూడ పెద్ద‌చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిని ర‌క్షించాల‌ని కోరారు.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *