బాధ్యతగా మెలగాలి తప్పా బ‌రి తెగిస్తే ఎలా..?

Spread the love

నిప్పులు చెరిగిన ఐఏఎస్ అధికారుల సంఘం

హైద‌రాబాద్ : ఒక బాధ్య‌త క‌లిగిన న్యూస్ ఛాన‌ల్ గా ఉండాల్సిన ఎన్టీవీ న్యూస్, ఎంట‌ర్టైన‌ర్ ఛాన‌ల్ అత్యంత జుగుస్సాక‌రంగా , వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణ‌మ‌న్నారు ఐఏఎస్ అధికారుల సంఘం కార్య‌ద‌ర్శి, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌యేష్ రంజ‌న్. ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మహిళ సీనియర్ ఐఏఎస్ అధికారిణిపై వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేలా క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌సారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

త‌క్ష‌ణ‌మే ఇలాంటి చ‌వ‌క‌బారు, నీతి మాలిన క‌థ‌నాల‌ను టెలికాస్ట్ చేసినందుకు గాను బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జ‌యేష్ రంజ‌న్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా భేషరతుగా క్షమాపణలు చెప్పాల‌ని లేక పోతే చట్ట పరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ప్ర‌ధానంగా మీడియా సంస్థలు బాధ్యతగా మెలగాలి తప్ప బరి తెగించవద్దని హితవు ప‌లికారు సీనియ‌ర్ అధికారి, కార్య‌ద‌ర్శి. ఈ మేరకు మీడియాకు లేఖ విడుదల చేశారు అసోసియేషన్ సెక్రటరీ జయేష్ రంజన్.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *