ట్రోలింగ్ పై డైరెక్ట‌ర్ మారుతి షాకింగ్ కామెంట్స్

కావాల‌ని రాజా సాబ్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు

హైద‌రాబాద్ : విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి తీసిన తాజా చిత్రం ది రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, అందాల భామ‌లు మాళ‌వికా మోహ‌న్, రిద్దీ కుమార్, నిధి అగ‌ర్వాల్ కీ రోల్స్ పోషించారు. ప్ర‌త్యేక పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ న‌టించాడు. పీపుల్స్ మీడియా ఆధ్వ‌ర్యంలో అధినేత‌లు టీజీ విశ్వ ప్ర‌సాద్, కూతురు కీర్తి ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ బ‌డ్జెట్ తో దీనిని తీశారు. అయినా ఊహించ‌ని రీతిలో మిశ్ర‌మ స్పంద‌న రావ‌డం, ప్ర‌త్యేకించి ట్రోల్స్ కు గురి కావ‌డం పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు త‌లెత్త‌డంతో కొన్ని రోజుల పాటు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాలేదు ద‌ర్శ‌కుడు మారుతి.

ఇదిలా ఉండ‌గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదిక‌పై నుంచి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు మారుతి. సినిమా న‌చ్చ‌క పోతే త‌న ఇంటికి రావాల‌ని చివ‌ర‌కు బ‌హిరంగంగానే అడ్ర‌స్ కూడా వెల్ల‌డించాడు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ అంతా త‌న‌పై దాడి చేసేందుకు వెళ్లారు. సెక్యూరిటీ , వ్య‌క్తిగ‌త సిబ్బందిపై కొంద‌రు అభిమానులు దాడి చేసేందుకు ప్ర‌యత్నం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించాడు ద‌ర్శ‌కుడు మారుతి. కొంద‌రు కావాల‌ని త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని, కానీ చివ‌ర‌కు త‌మ సినిమా రాజా సాబ్ త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని, పెట్టిన డ‌బ్బులు తిరిగి రావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు .

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *