ఏపీలో రికార్డు స్థాయిలో మిర్చి ఉత్ప‌త్తి

మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీలో రికార్డ్ స్థాయిలో మిర్చి ఉత్ప‌త్తి జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సీజన్‌లో సుమారు 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా వేశామ‌న్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, నారుమడి పెంపకం, సమగ్ర సస్యరక్షణపై గ్రామస్థాయిలో నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పురుగు మందుల అవశేషాలు లేకుండా నాణ్యమైన మిర్చి ఉత్పత్తి లక్ష్యంగా IPM, INM విధానాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. డిజిటల్ గ్రీన్, ITC సంస్థల సహకారంతో మిర్చి నాణ్యత ప్రమాణాలు పెంచుతున్నామని తెలిపారు.

గత సీజన్‌లో కామన్ రకాలకు క్వింటాలుకు రూ.12,500, స్పెషల్ రకాలకు రూ.13,500 ధర లభించగా, ఈ ఏడాది ప్రస్తుతం రూ.15,000 నుంచి రూ.19,500 వరకు ధరలు నమోదవుతున్నాయని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల కేవలం మిర్చి మాత్రమే కాకుండా అన్ని పంటలకు కూడా మెరుగైన ధరలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తుండగా, హెక్టారుకు సగటున 19.81 మెట్రిక్ టన్నుల ఉత్పాదకత సాధిస్తున్నారని చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *