గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు
గుంటూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో గుంటూరు జిల్లాలోని మంత్రి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు ఆయనపై దాడి చేసేందుకు యత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరో వైపు అంబటి రాంబాబుకు చెందిన ఇంటిని, కారును ధ్వంసం చేశారు. నిప్పంటించారు అవి పనికి రాకుండా పోయాయి. తన ఆఫీసులో ఫర్నీచర్ ను చిందర వందర చేశారు.
దీంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చోటు చేసుకుంది. చివరకు టీడీపీ శ్రేణుల దెబ్బకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. అనంతరం భారీ పోలీసు భద్రత మధ్య అర్దరాత్రి అంబటిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తన ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరకు భారీ భద్రత మధ్య అంబటి రాంబాబును నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా అంతటా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.






