సిట్ నోటీస్ మాజీ కేసీఆర్ కేసీఆర్ సీరియ‌స్

పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌న్న మాజీ ముఖ్య‌మంత్రి

హైద‌రాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్య‌వ‌హారం రోజు రోజుకు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌ను విచారించింది సిట్. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 1న ఆదివారం విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పేర్కొంది. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ సీం కేసీఆర్. ఆయ‌న సిట్ కు త‌న‌ను విచారించే అధికారం లేదంటూ మండిప‌డ్డారు. 65 ఏళ్లు పైబ‌డిన వారిని తాము ఉంటున్న చోటుకు పిల‌వ కూడ‌ద‌ని, ఇది చ‌ట్టం చెబుతోంద‌ని, ఆ మాత్రం తెలుసుకోక పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు కేసీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు.

అయితే ఇదే స‌మ‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మాజీ సీఎం. త‌ను భార‌తీయ పౌరుడిన‌ని, చ‌ట్టం అంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని, విచార‌ణ కోసం హాజ‌ర‌య్యేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేదంటూ స్ప‌ష్టం చేశారు లేఖ‌లో కేసీఆర్. ఇదే స‌మ‌యంలో త‌న ఎన్నికల అఫిడవిట్ లోని చిరునామాకు, సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని పేర్కొన్నారు కేసీఆర్. హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని విమర్శించారు. పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *