ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఆర్థిక శాఖ మంత్రి

న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం ఆదివారం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.
ఈ మేర‌కు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు చేస్తామ‌న్నారు. అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, అరకు, పశ్చిమ కనుమల్లో పర్యటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో తాబేలు కేంద్రాలు అభివృద్ధి ప‌రుస్తామ‌ని పేర్కొన్నారు నిర్మ‌లా సీతారామ‌న్‌. ఈ పర్యాటక కేంద్రాల్లో శాశ్వత అభివృద్ధి కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అంతరాయం లేని రవాణా మార్గాలు ఏర్పాటు దిశగా అన్వేషణ చేస్తున్నామ‌న్నారు.

ఇక ఐటీ , ప‌న్నుల చ‌ట్టం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి. ట్యాక్స్ నిబంధనల్లో సడలింపు చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు . TCS 5% నుంచి 2 శాతానికి తగ్గిస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో పాటు మోటార్ యాక్సిడెంట్‌ చెల్లింపులపై పన్ను సడలిస్తున్నామ‌న్నారు. ప‌న్ను చెల్లంపుదారుల‌కు తీపి క‌బురు చెప్పారు. మార్చి 31 వరకు ఆదాయపన్ను చెల్లింపుకు గడువు పొడిగిస్తున్న‌ట్లు తెలిపారు. జులై 31 వరకు ఐటీఆర్ 1, ఐటీఆర్ 2: విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్‌ టైమ్ స్కీమ్ అమ‌లు చేస్తామ‌న్నారు. చిన్న తరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు 6 నెలల ఊరట క‌ల్పించారు.

  • Related Posts

    రాష్ట్ర అభివృద్దిపై కూట‌మి స‌ర్కార్ ఫోక‌స్

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : త‌మ ప్ర‌భుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు…

    ప్ర‌తిప‌క్ష నేత‌ను మాట్లాడ‌కుండా చేస్తే ఎలా..?

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న్యూఢిల్లీ : మోదీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది కాంగ్రెస పార్టీ. ఈ మేర‌కు ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాన అంశాల‌పై ప్ర‌శ్నించేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *