ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఆర్థిక శాఖ మంత్రి

న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం ఆదివారం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.
ఈ మేర‌కు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు చేస్తామ‌న్నారు. అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, అరకు, పశ్చిమ కనుమల్లో పర్యటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో తాబేలు కేంద్రాలు అభివృద్ధి ప‌రుస్తామ‌ని పేర్కొన్నారు నిర్మ‌లా సీతారామ‌న్‌. ఈ పర్యాటక కేంద్రాల్లో శాశ్వత అభివృద్ధి కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అంతరాయం లేని రవాణా మార్గాలు ఏర్పాటు దిశగా అన్వేషణ చేస్తున్నామ‌న్నారు.

ఇక ఐటీ , ప‌న్నుల చ‌ట్టం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి. ట్యాక్స్ నిబంధనల్లో సడలింపు చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు . TCS 5% నుంచి 2 శాతానికి తగ్గిస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో పాటు మోటార్ యాక్సిడెంట్‌ చెల్లింపులపై పన్ను సడలిస్తున్నామ‌న్నారు. ప‌న్ను చెల్లంపుదారుల‌కు తీపి క‌బురు చెప్పారు. మార్చి 31 వరకు ఆదాయపన్ను చెల్లింపుకు గడువు పొడిగిస్తున్న‌ట్లు తెలిపారు. జులై 31 వరకు ఐటీఆర్ 1, ఐటీఆర్ 2: విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్‌ టైమ్ స్కీమ్ అమ‌లు చేస్తామ‌న్నారు. చిన్న తరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు 6 నెలల ఊరట క‌ల్పించారు.

  • Related Posts

    త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

    Spread the love

    Spread the loveఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు…

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *