అగ్ని ప్ర‌మాదాల‌పై హైడ్రా అవ‌గాహన‌

Spread the love

శ్రీ‌కారం చుట్టిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో వ‌రుస‌గా అగ్ని ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌లే నాంప‌ల్లి లోని ఫ‌ర్నీచ‌ర్ షో రూంలో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీంతో హైడ్రా అప్ర‌మ‌త్తం అయ్యింది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్వ‌యంగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల‌లో స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌డం లేద‌ని గుర్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆపై నియ‌మ నిబంధ‌న‌లు పాటించని షాపుల‌కు తాళాలు వేశారు. ఇదే స‌మ‌యంలో ఫైర్ సేఫ్టీ పై అవ‌గాహ‌న శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు హైడ్రా , ఇత‌ర శాఖ‌ల సమ‌న్వ‌యంతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌లో అవ‌గాహ‌న శిబిరాలు చేప‌ట్టారు. ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ప్పుడు ఎలా వ్య‌వ‌హరించాలి, ఎలా బ‌య‌ట ప‌డాల‌నే దానిపై వివ‌రించారు. కార్మికులు,వ్యాపారులు ఎలా భద్రంగా ఎలా బ‌య‌ట ప‌డాలో సూచించారు. షాపులలో ఫైర్ ఎగ్జిట్ మార్గాలను గుర్తించడం.. మంట‌లు అంటుకుంటే అగ్ని మాప‌క శాఖ‌కు చెందిన 101తో పాటు.. హైడ్రా కంట్రోల్ రూమ్ 1070తో పాటు 9000113667 కు ఫోను చేయాల‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా కొన్ని చోట్ల ఫైర్ మాక్ డ్రిల్స్ నిర్వ‌హించారు.

  • Related Posts

    త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

    Spread the love

    Spread the loveఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు…

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *