మోదీ స‌ర్కార్ నిర్ణ‌యం కూలీల‌కు శాపం

Spread the love

ఆవేద‌న వ్య‌క్తం చేసిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. కార్పొరేట్ శ‌క్తుల‌కు, వ్యాపారవేత్త‌ల‌కు మేలు చేకూర్చేలా ప్ర‌ధాన‌మంత్రి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్రను చేప‌ట్టింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ష‌ర్మిల‌కు జ‌నం నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. ఆమె అటు కేంద్ర స‌ర్కార్ ను ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గడుతున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా తాను చేప‌ట్టిన ప‌రిరక్ష‌ణ యాత్ర‌ ఏలూరు జిల్లాలోకి చేరుకుంది.

చింతలపూడి నియోజక వర్గంకు చెందిన‌ ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఎర్రంపల్లి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ వేదికగా మన్రేగా పథకం లబ్ధిని, ప్రధాని మోడీ తెచ్చిన కొత్త అక్రమ చట్టం VB G- RAM G ద్వారా జరిగే నష్టాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి హామీ పథకం పునరుద్ధరించాల‌ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను స్థానికులు ఎండగట్టారు. అర్హులకు కొత్తగా పెన్షన్లు ఇవ్వడం లేదని, మహాశక్తి పథకం కింద నెలకు 15 వందలు ఎప్పుడిస్తారని మహిళలు చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు.

  • Related Posts

    పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం స‌మీక్ష

    Spread the love

    Spread the loveకీల‌క సూచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధ‌వారం స‌చివాల‌యంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వ‌హించారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చ‌ర్చించారు.…

    జ‌గ‌న్ రెడ్డికి పండితుల ఆశీర్వాదం

    Spread the love

    Spread the loveపులివెందుల లోని ఆయ‌న నివాసంలో క‌డ‌ప జిల్లా : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా జిల్లాలోని పులివెందుల త‌న‌ నివాసంలో,కోదండ రామాలయానికి చెందిన వేద పండితులు విచ్చేసి ప్రత్యేకంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *