ప్రాజెక్టుల నిర్మాణాల్లో రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేదు

నాణ్య‌త పాటించ‌క పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ప‌నితీరుపై స‌మీక్ష చేప‌ట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండ కూడదని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, పోలవరం-నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఆరా తీశారు. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ ఇప్పుడూ విశేష ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఝంఝావతి రబ్బర్ డ్యాం కొట్టుకు పోయిందంటూ గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ దెబ్బతినేలా చేశారని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డిపై. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ కు రిపేర్లు చేసినా సరిపోతుందని నిపుణులు నివేదికలు ఇచ్చిన విష‌యాన్ని తెలిపారు. అయితే నాణ్యత విషయంలో, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం అని సీఎం స్పష్టం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష లో పాల్గొన్నారు.

  • Related Posts

    పార్టీ గీత దాటితే వేటు త‌ప్ప‌దు : టీడీపీ చీఫ్

    అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ అత్యంత క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇటీవ‌ల కొంద‌రు త‌మ ఇష్టానుసారం బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడుతున్నార‌ని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.…

    రైతుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్న సీఎం

    హైద‌రాబాద్ : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ స‌ర్కార్ అనుస‌రిస్తున్న విధానాలు పూర్తిగా అసంబద్దంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. బుధ‌వారం సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎందుకు వ‌రిని సాగు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *