ప్రాజెక్టుల నిర్మాణాల్లో రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేదు

నాణ్య‌త పాటించ‌క పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ప‌నితీరుపై స‌మీక్ష చేప‌ట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండ కూడదని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, పోలవరం-నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఆరా తీశారు. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ ఇప్పుడూ విశేష ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఝంఝావతి రబ్బర్ డ్యాం కొట్టుకు పోయిందంటూ గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ దెబ్బతినేలా చేశారని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డిపై. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ కు రిపేర్లు చేసినా సరిపోతుందని నిపుణులు నివేదికలు ఇచ్చిన విష‌యాన్ని తెలిపారు. అయితే నాణ్యత విషయంలో, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం అని సీఎం స్పష్టం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష లో పాల్గొన్నారు.

  • Related Posts

    నీట్ యుజి 2026 పేప‌ర్ లీక్ పై సీబీఐ ఛార్జిషీట్

    న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది కేంద్ర విద్యా శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన నీట్ యుజి 2026 ప‌రీక్ష లీక్ అయ్యింది. దీంతో త‌ట్టుకోలేక 21 మందికి పైగా విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. దీంతో గ‌త్యంత‌రం లేక కేంద్రంలో కొలువు…

    తెలంగాణ రాష్ట్రానికి 1.56 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయించండి

    న్యూఢిల్లీ : తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్ల‌ను కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను క‌లిసి విన్న‌వించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *