ముగిసిన కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

Spread the love

ఆల‌యంలో తొమ్మిది రోజుల పాటు ఉత్స‌వాలు

తిరుప‌తి : తిరుపతిలోని ప్ర‌సిద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న‌ శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో గ‌త తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వ‌హించారు స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు. వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించి, గరుడ పటాన్ని అవతరింపజేశారు.

ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు సమస్త పాప విముక్తులై, ధన ధాన్య సమృద్ధితో తుల తూగుతారని ఐతిహ్యం. అలాగే విషమృత్యు నాశనం కలిగి, రాజ్య పదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని ప్ర‌గా విశ్వాసం. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో చేసిన ఏర్పాట్లు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌తి రోజూ భ‌క్తులు వివిధ ప్రాంతాల విచ్చేసి స్వామి వారి కృప‌కు పాత్రుల‌య్యారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయ‌డం ప‌ట్ల భ‌క్త జ‌న బాంధ‌వులు టీటీడీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాములోరి స‌న్నిధిలో మంత్రి నారా లోకేష్‌

    Spread the love

    Spread the loveపునః ప్ర‌తిష్ట మ‌హోత్స‌వంలో పాల్గొని పూజ‌లు అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధ‌వారం తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణం కొప్పురావుకాలనీలో నూతనంగా రామాలయ పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు.…

    అశ్వ వాహనంపై అభయ మూర్తి శ్రీరాముడు

    Spread the love

    Spread the loveబ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతం తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *