వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు

Spread the love

ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపిన కేబినెట్

అమరావతి: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారు యువనేత నారా లోకేష్. తాము కులవృత్తి చేసుకుని జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు ఇవ్వాల్సిందిగా పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు మంత్రి లోకేష్ కు విన్నవించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం వడ్డెరలకు మైనింగ్ లీజులు కేటాయించే అంశాన్ని మంత్రి లోకేష్ తాజాగా కేబినెట్ ముందుకు తెచ్చారు. వడ్డెర సోదరుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పెంచడానికి వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలతో త్వరలోనే ప్రభుత్వం జీవో జారీ చేయనుంది.

యువగళం పాదయాత్ర సమయంలో యువనేత లోకేష్ ప్రతిరోజూ వివిధ సామాజిక వర్గాల ప్రజలతో సమావేశమై వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. ఆ సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మాట నిలబెట్టు కుంటున్నారు. గత వైసీపీ వివిధ సామాజికవర్గాలను కేవలం ఎన్నికల్లో ఓట్లకోసం మాత్రమే ఉపయోగించుకొని, అవసరం తీరాక గాలికొదిలేసింది. అటువంటి ఓటుబ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలుకుతూ వివిధ సామాజిక వర్గాల మనోభీష్టాన్ని నెరవేరుస్తున్నారు రాష్ట్రమంత్రి, యువనేత నారా లోకేష్.

  • Related Posts

    వ్య‌క్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేర‌ళ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి సీఎంగా వీడీ స‌తీశ‌న్ ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఖ‌ర్గే. దీంతో నిన్న‌టి దాకా సీఎం…

    రేపే 12 ప్రాజెక్టుల‌కు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాప‌న‌

    Spread the love

    Spread the loveఇక నుంచి రాయ‌ల‌సీమ రక్ష‌ణ సీమ అమ‌రావ‌తి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్ర‌వారం రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *