ఓట్ల చోరీ చేయ‌డం వ‌ల్లే ఎన్డీయే గెలిచింది

Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ : ఏపీకి చెందిన ప్ర‌ముఖ మేధావి, రాజ‌కీయ అన‌లిస్ట్ , ర‌చ‌యిత ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా మోదీ స‌ర్కార్ ను , అది చేస్తున్న అప్ర‌జాస్వామిక ప‌నుల గురించి ఏక‌రువు పెడుతూ వ‌స్తున్నారు. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెబుతున్నారు. ఆపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేస్తూ వ‌స్తున్నారు. ఈ సంద‌ర్బంగా స‌మావేశాలు, వ‌రుస సెమినార్ల‌తో బిజీగా ఉన్నారు. తాజాగా జాతీయ మీడియా ట్రైబ్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్.

భార‌త దేశంలో 2024లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భారతీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ పార్టీల‌తో కూడిన ఎన్డీయే ఓట్ల చోరీకి పాల్ప‌డింద‌ని ఆరోపించారు. అందువ‌ల్ల‌నే దేశంలో తిరిగి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. నిస్సిగ్గుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం మోదీకి, అమిత్ షా ప‌రివారానికి మేలు చేకూర్చేలా చేసింద‌ని మండిప‌డ్డారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్. ఓటు చోరీ గ‌నుక జరగక పోయి ఉంటే.. 316 సీట్లతో INDIA కూటమి అధికారంలోకి వచ్చి ఉండేద‌ని చెప్పారు. NDA కూటమి కేవలం 213 సీట్లకే పరిమితమై.. ప్రతిపక్ష హోదాలో ఉండేదన్నారు. కానీ.. ఓటు చోరీతో NDA అదనంగా 79 సీట్లను సొంతం చేసుకొని, అధికారంలోకి వచ్చిందన్నారు.

  • Related Posts

    స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత

    Spread the love

    Spread the loveయువతకు లక్ష ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న చంద్ర‌బాబు అమ‌రావ‌తి : అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన బైసర్‌ను, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్‌రావును అభినందిస్తున్న‌ట్లు తెలిపారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విద్య, వైద్యంలో తిరుగులేని స్థాయిలో ఉండేలా…

    సైబ‌ర్ నేరాల‌పై నియంత్ర‌ణ అవ‌స‌రం

    Spread the love

    Spread the loveయాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌న్న సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సైబ‌ర్ నేరాల నియంత్ర‌ణ‌కు త‌క్ష‌ణ‌మే యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌ని ఆదేశించారు. స‌చివాల‌యంలో సైబ‌ర్ ఫ్రాడ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *