బాస‌ర స‌రస్వ‌తి ఆల‌య అభివృద్దిపై ఫోక‌స్

Spread the love

ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : పవిత్ర జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రాన్ని మ‌రింత అందంగా, స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చి దిద్దేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శ‌నివారం హైద‌రాబాద్ లో బాసర అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ లో పలు మార్పులు చేర్పులు సూచించారు సీఎం. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆలయ పరిసరాల్లో EV వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని అన్నారు. కేవ‌లం భ‌క్తికి మాత్ర‌మే చోటు ఉండాల‌ని పేర్కొన్నారు. ప్ర‌తి నిత్యం ఎంత మంది భ‌క్తులు వ‌స్తున్నార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఏమేం ప‌నులు చేప‌ట్టారో తెలియ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కీల‌క స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణా రావు, దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ క‌మిష‌న‌ర్ శైల‌జా రామయ్య‌ర్, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, ఇత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    సైబ‌ర్ నేరాల‌పై నియంత్ర‌ణ అవ‌స‌రం

    Spread the love

    Spread the loveయాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌న్న సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సైబ‌ర్ నేరాల నియంత్ర‌ణ‌కు త‌క్ష‌ణ‌మే యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌ని ఆదేశించారు. స‌చివాల‌యంలో సైబ‌ర్ ఫ్రాడ్…

    రైతుల ధాన్యానికి ఏపీ స‌ర్కార్ భ‌రోసా

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రైతుల‌కు తీపి క‌బురు చెప్పింది. రైతులు న‌ష్ట పోకుండా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించేందుకు కేంద్రం సానుకూలంగా వ్య‌వ‌హ‌రించింద‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *