వ‌ర‌ద కాలువ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం

హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని చెరువుల‌ను పూర్తి స్థాయిలో ప‌ర్యాట‌క ప్రాంతాలుగా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. మాధాపూర్ లోని చెరువుల‌ను ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈసంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు. సున్నం చెరువు చెంత‌న ఉన్న బోర‌బండ బ‌స్తీ, ఎన్ ఆర్ ఆర్ పురం నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీరు నేరుగా చెరువులోకి క‌లిసేలా ఇన్‌లెట్ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. వ‌ర‌ద నీరు చెరువులోకి చేరేలా.. మురుగు నీరు కింద‌కు పోయేలా డైవ‌ర్ట్ కాలువ నిర్మాణం కూడా పూర్త‌య్యింద‌ని చెప్పారు.

ఇందులో భాగంగా త్వ‌ర‌లో అనుసంధానం చేయాల్సి ఉంద‌ని అధికారులు ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. అయితే ఈ అనుసంధానం జ‌ర‌గ‌క పోవ‌డంతో సున్నం చెరువు రోడ్డు నుంచి బ‌స్తీలోకి వెళ్లే మార్గం ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని స్తానికులు వాపోయారు. ఇక్క‌డ పైపులైన్లు వేసి మురుగు సాఫీగా సాగేలా చూడాల‌ని క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల్లో మున్సిప‌ల్ అధికారుల‌తో క‌లిసి వ‌చ్చి స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు. సున్నం చెరువును ఆనుకుని వెళ్తున్న హైటెన్ష‌న్ వైర్ల కింద ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *