ఇక అమ‌రావ‌తిని ఎవ‌రూ మార్చ‌లేరు – శ్రీ‌

జ‌గ‌న్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావ‌ణి

అనంత‌పురం జిల్లా : ఎన్ని కుట్ర‌లు చేసినా చివ‌ర‌కు అంతిమంగా ధ‌ర్మ‌మే గెలిచింద‌ని అన్నారు సింగ‌న‌మ‌ల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్దత వచ్చిన సందర్భంగా పార్లమెంటులో సహకరించిన పార్టీలకు, నేతలకు, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తు అనంతపురం జిల్లా , శింగనమల నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీపాలు వెలిగించారు ఎమ్మెల్యే. ప్రజా రాజధాని అమరావతి కి దీ పహారతులు ఇచ్చారు.

అమరావతి బిల్లుకు ఉభయ సభలలో ఆమోదం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. ఇది ప్రజా రాజధాని అని.. నా రాజధాని అమరావతి అంటూ గర్వంగా చాటాల‌ని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం సాధించిన విజయంగా అభివ‌ర్ణించారు. రాష్ట్ర రాజధాని అమరావతి పై వైసీపీ నేత జగన్ విషం కక్కడం మానాల‌ని హిత‌వు ప‌లికారు. ప్రజలు కోరిన ప్రజా రాజధానికి మద్దతు పలికేందుకు జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. అమరావతి రాజధానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రధాని నరేంద్ర మోడీకి,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *