మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఘన సన్మానం
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన దెబ్బకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్టకేలకు దిగి వచ్చింది. వారు ముందు ఉంచిన 32 డిమాండ్లను ఒప్పుకుంది. గత్యంతరం లేక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ కీలక నిర్ణయం తీసుకున్నందుకు నిన్న అర్ధరాత్రి నుంచే సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్చలు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం నెరవేర్చడంతో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం.. కార్మికులకు గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ ,ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు జేఏసీ నేతలు వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి,హనుమంతు ముదిరాజ్ ,ఇతర సంఘాల నేతలు. ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం తో ప్రజా రవాణా ను మరింత బలపరిచేలా ఉత్సాహం తో కార్మికులు పని చేయాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.





