బీజేపీలోకి వెళ్ల‌డం లేదు బీఆర్ఎస్ లోనే ఉన్నా

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి
హైద‌రాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా త‌మ కుటుంబంపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేవ‌లం త‌మ సంస్థ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని కోరేందుకు ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌లవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. పార్టీ మార‌బోవ‌డం లేద‌న్నారు మ‌ల్లారెడ్డి.

పార్టీ మారుతున్నారనే ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నారు. అవన్నీ అవాస్తవ ప్రచారాలే అని ఆయన కొట్టి పారేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి ఎలాంటి సందేహాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తాజాగా జ‌రిగిన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో మ‌ల్లారెడ్డిపై సీరియ‌స్ అయిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

  • Related Posts

    సేవాద‌ళ్ వాలంటీర్ల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్ : సేవాద‌ళ్ వాలంటీర్లు చేస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ‘సమర్థ్‌’…

    మే 10న ప్ర‌ధాని మోదీ హైద‌రాబాద్ కు రాక‌

    Spread the love

    Spread the loveభారీ ఏర్పాట్లు చేస్తున్నామ‌న్న బీజేపీ చీఫ్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే 10వ తేదీన దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప‌ర్య‌టించ‌నున్నార‌ని వెల్ల‌డించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్ రావు. ఆయ‌న కేంద్ర మంత్రి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *