మెరుగైన ఫ‌లితాలు ప్ర‌గ‌తికి సోపానాలు

Spread the love

ప్ర‌శంసించిన మంత్రి ఎస్. స‌విత

అమ‌రావ‌తి :టెన్త్ ఫలితాల్లో ఎంజేపీ గురుకులు, బీసీ హాస్టళ్ల విద్యార్థులు సత్తా చాటడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. ఎంజేపీలో 96.02 శాతంతో, బీసీ హాస్టళ్లలో 85.99 శాతంతో ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మంత్రి లోకేశ్ రూపొందించిన వంద రోజుల ప్రణాళికలు సత్ఫలితాలు ఇచ్చాయ‌న్నారు. బీసీ బిడ్డలు అత్యున్నత స్థానాల్లో నిలవాలన్నది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంకల్పమన్నారు. విద్యతోనే అత్యున్నత స్థానాలు సాధ్యమని నమ్మి, ఎంజేపీ, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి రెండేళ్లలో పెద్దఎత్తున నిధులు కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో బీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కొనియాడారు.

సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు బీసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫున మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. టెన్త్ పరీక్షల్లో ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు 96.02 శాతంతో ఉత్తీర్ణత సాధించడంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి సవితను ఆ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవీలత మర్యాద పూర్వకంగా కలిశారు. గతేడాది కంటే అత్యధిక ఫలితాలు సాధించినందుకు కార్యదర్శి సత్యనారాయణకు, మాధవీలతకు స్వీట్లు అందజేసి, మంత్రి అభినందించారు.

  • Related Posts

    కార్మిక వ‌ర్గాల‌కు సీఎం శుభాకాంక్ష‌లు

    Spread the love

    Spread the loveనేడు అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం మేడే సంద‌ర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో కార్మిక వ‌ర్గ‌…

    దేశానికి ఆద‌ర్శంగా ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్

    Spread the love

    Spread the loveసీపీ వీసీ స‌జ్జ‌నార్ కు కేంద్రం ప్ర‌శంస‌ హైద‌రాబాద్ : సైబర్‌ నేరగాళ్ల అక్రమ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు హైదరాబాద్‌ పోలీసులు ఎక్కుపెట్టిన ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ అస్త్రం ఇప్పుడు దేశవ్యాప్త సమరానికి దిక్సూచిగా మారింది. నగర పోలీస్ యంత్రాంగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *