ఈ జ‌న్మ‌లో అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి కాదు

అంబ‌టి రాంబాబు షాకింగ్ కామెంట్స్

నంద్యాల జిల్లా : మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై మండిప‌డ్డారు. నంద్యాల‌లో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు, లోకేష్ ఈ జన్మలో అమరావతి నిర్మాణం పూర్తి చేయలేరని అన్నారు. రాష్ట్ర ప్రజలను దోచుకోవడానికే చంద్రబాబు అమరావతిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. రూ. 2 లక్షల కోట్ల ప్రతిపాదనలతో ఇప్పటికే రూ. 75 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అమరావతి కాంట్రాక్టర్లకు ప్రజల సొమ్ము దోచిపెట్టడం సరైంది కాదని ధ్వ‌జ‌మెత్తారు.

చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలంటూ అంబటి తీవ్ర విమర్శలు చేశారు. ఈ జ‌న్మ‌లో సీఎం, మంత్రి అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయ‌లేర‌న్నారు అంబ‌టి రాంబాబు. రాష్ట్రాన్ని అన్ని రంగాల‌ను స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. వారి నిర్వాకం వ‌ల్ల‌నే ఏపీ మ‌రో వందేళ్లు వెన‌క్కి వెళుతోంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల పేరుతో పేద‌ల భూములు లాక్కుంటున్నార‌ని, ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు అంబ‌టి రాంబాబు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *