వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగితే చ‌ర్య‌లు : డీజీపీ

Spread the love

క్రైమ్ మీటింగ్స్ ద్వారా ప‌నితీరు ప‌ర్య‌వేక్షిస్తాం

హైద‌రాబాద్ : నూత‌న డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రైనా స‌రే ఏస్థాయిలో ఉన్నా స‌రే , కీల‌క ప‌ద‌వుల‌లో ఉన్నా , వ్య‌క్తిగ‌త దూష‌ణల‌కు దిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు . మిగిలి ఉన్న వారు కూడా పునరావాస పాలసీ ప్రకారం జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశలో ఉందన్నారు డీజీపీ. త్వరలోనే సమీక్షించి దానికి అనుగుణంగా చార్జ్ షీట్ వేస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రాజ్యాంగ బద్ధమైన భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తామన్నారు సీవీ ఆనంద్. చివరగా, తాను ‘మెక్రో మేనేజ్‌మెంట్’ విధానాన్ని అనుసరిస్తానని చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే క్రైమ్ మీటింగ్స్ ద్వారా వారి పనితీరును పర్యవేక్షిస్తానని డిజిపి సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో శాంతి భద్రతల డిజి మహేష్ ఎం భగవత్, టిఎస్ఎల్పిఆర్బి చైర్మన్ వివి శ్రీనివాసరావు, ఎస్పిఎఫ్ డిజి స్వాతి లక్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్, డిజి, సిఐడి చారు సిన్హా, గ్రేహౌండ్స్ , ఆక్టోపస్ డిజి అనిల్ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

  • Related Posts

    చేనేత రంగ అభివృద్ధికి పెద్దపీట

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎస్. స‌విత అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు ఒకవైపు చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతూనే, నేతన్నలకు…

    క‌విత పార్టీని న‌మ్మి మోస‌పోవ‌ద్దు : కేఏ పాల్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ హైద‌రాబాద్ : ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ అంబాసిడ‌ర్ , ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్ ) పేరుతో కొత్త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *