వైభ‌వోపేతంగా ప‌త్ర పుష్ప యాగం

Spread the love

భక్తులకు దివ్య‌మైన అనుభూతి

తిరుప‌తి : తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో ప‌త్ర పుష్ప యాగం వైభవంగా జ‌రిగింది. ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వ‌హించారు. ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామివారు, శ్రీ కామ‌క్షి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు న‌వ క‌ల‌శ స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు ర‌సం, కొబ్బ‌రినీళ్ళు, విబూది, ప‌సుపు, చంద‌నంల‌తో అభిషేకం చేశారు.

ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్ర పుష్ప‌యాగ మ‌హోత్స‌వం జ‌రిగింది. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామ‌ర‌, మ‌ల్లి, వృక్షి, క‌న‌కాంబ‌రంల‌తో పాటు బిల్వ ప‌త్రం, తుల‌సి, ప‌న్నీరు ఆకుల‌తో స్వామి, అమ్మవార్లకు ప‌త్ర పుష్ప యాగం నిర్వహించారు. ఆంధ్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ రాష్ట్రాల నుండి దాత‌లు 3 ట‌న్నులు పుష్పాలు, పత్రాలు విరాళంగా అందించారు. ఇందులో 12 ర‌కాల‌ పుష్పాలు, 6 ర‌కాల ప‌త్రాలు ఉన్నాయి. ఆల‌యంలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా ప‌త్ర పుష్పయాగం నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.

  • Related Posts

    సిరుల తల్లికి స్న‌ప‌న తిరుమంజ‌నం

    Spread the love

    Spread the loveఘ‌నంగా వ‌సంతోత్స‌వాల నిర్వ‌హ‌ణ తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు,…

    తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    Spread the love

    Spread the loveఆల‌య మాడ వీధుల్లో విహ‌రించిన స్వామి తిరుమ‌ల : తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *