రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో

హైద‌రాబాద్ : భార‌త దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి ఈనెల 4వ తేదీన వెల్ల‌డి కానున్నాయి. ఇందుకు సంబంధించి ఉత్కంఠ రేపుతోంది. సోమ‌వారం ఉద‌యం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు ఉ.9 గంటల నుంచి తొలి ట్రెండ్స్ ప్రారంభమై , రేపు మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంద‌ని ఈసీ వెల్ల‌డించింది. అంద‌రి చూపు ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌పై ఉంది. త‌మిళ‌నాట అధికారంలో ఉన్న డీఎంకే , అన్నాడీఎంకే, టీవీకే పార్టీల మ‌ధ్య పోరు కొన‌సాగుతోంది. ఇక సుదీర్ఘ కాలం ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొలువు తీరిన టీఎంసీ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య నెల‌కొంది. ప్ర‌స్తుతం బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్ కొన‌సాగుతోంది.

తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే కూటముల మధ్య హోరాహోరీ జ‌రిగింది. దీంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్: కేంద్ర ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండ‌గా ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశించింది ఈసీ . 285 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ జ‌ర‌గ‌నుంది. కాగా ఫాల్తా నియోజకవర్గంలో ఈ నెల 24న ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *