రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

Spread the love

బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో

హైద‌రాబాద్ : భార‌త దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి ఈనెల 4వ తేదీన వెల్ల‌డి కానున్నాయి. ఇందుకు సంబంధించి ఉత్కంఠ రేపుతోంది. సోమ‌వారం ఉద‌యం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు ఉ.9 గంటల నుంచి తొలి ట్రెండ్స్ ప్రారంభమై , రేపు మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంద‌ని ఈసీ వెల్ల‌డించింది. అంద‌రి చూపు ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌పై ఉంది. త‌మిళ‌నాట అధికారంలో ఉన్న డీఎంకే , అన్నాడీఎంకే, టీవీకే పార్టీల మ‌ధ్య పోరు కొన‌సాగుతోంది. ఇక సుదీర్ఘ కాలం ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొలువు తీరిన టీఎంసీ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య నెల‌కొంది. ప్ర‌స్తుతం బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్ కొన‌సాగుతోంది.

తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే కూటముల మధ్య హోరాహోరీ జ‌రిగింది. దీంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్: కేంద్ర ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండ‌గా ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశించింది ఈసీ . 285 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ జ‌ర‌గ‌నుంది. కాగా ఫాల్తా నియోజకవర్గంలో ఈ నెల 24న ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుంది.

  • Related Posts

    క‌విత పార్టీని న‌మ్మి మోస‌పోవ‌ద్దు : కేఏ పాల్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ హైద‌రాబాద్ : ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ అంబాసిడ‌ర్ , ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్ ) పేరుతో కొత్త…

    త‌మిళ‌నాడులో హంగ్ ఏర్ప‌డే ఛాన్స్

    Spread the love

    Spread the loveఅప్ర‌మ‌త్త‌మైన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. ఈనెల 4వ తేదీన సోమ‌వారం రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు సంబంధించి 234 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన తుది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *