సైబ‌ర్ నేరాల‌పై నియంత్ర‌ణ అవ‌స‌రం

యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌న్న సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సైబ‌ర్ నేరాల నియంత్ర‌ణ‌కు త‌క్ష‌ణ‌మే యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌ని ఆదేశించారు. స‌చివాల‌యంలో సైబ‌ర్ ఫ్రాడ్ , సెక్యూరిటీపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు. పిషింగ్, విషింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు, ఆన్ లైన్ లోన్ ఫ్రాడ్స్ సహా డిజిటల్ అరెస్టుల్లో బాధితులు సొమ్మును కోల్పోతున్నట్టు డిజీపీ తెలిపారు. సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పని చేస్తోందని చెప్పారు.

అంతే కాకుండా విజయవాడ, విశాఖ, తిరుపతిలలో సైబర్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు ఏపీలో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా డేటాకు రక్షణ కల్పిస్తున్నామని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సీఎంకు వివరించారు. ఈ సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీ ఫోరెన్సిక్స్ సలహాదారు కెపీసీ గాంధీ, రిజర్వు బ్యాంకు సహా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *