ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్
హైదరాబాద్ : ప్రముఖ నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మలయాళ నటుడు మమ్ముట్టిని కలిశానని, ఈ సందర్బంగా తనతో కీలక చర్చలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆయనతో భేటీ కావడం తన జీవితంలో నెరవేరని కలగా అభివర్ణించారు. రేణు తన అభిమాన క్షణాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ ఒక పోస్ట్ రాశారు. మెగాస్టార్ మమ్ముట్టిని కలవడం గురించి రేణు చేసిన హృదయపూర్వక నిజాయితీతో కూడిన పోస్ట్ సోషల్ మీడియా అంతటా దృష్టిని ఆకర్షించింది. నటి, చిత్రనిర్మాత రేణు దేశాయ్, చిరకాల కోరిక నెరవేరడంతో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని చివరికి కలిసి ఆనందంతో గాల్లో తేలుతున్నారు. ఈ కలయికను తన జీవితంలోనే అతిపెద్ద “అభిమాన క్షణాలలో” ఒకటిగా అభివర్ణించారు.
ఈ మరపురాని అనుభవాన్ని అభిమానులతో పంచుకుంటూ తన ఉత్సాహాన్ని దాచుకోలేక పోయారు. ఇన్స్టాగ్రామ్లో రేణు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలా రాశారు, ఇది నాకు ఒక పూర్తిస్థాయి అభిమాన క్షణం… మమ్ముట్టి సర్ను కలవడం, ఆయనతో కొంత సమయం గడపడం నా జీవితంలో నెరవేరని కోరికలలో ఒకటి, అది చివరికి నిజమైంది. నా హృదయం, ఆత్మ ఆనందంతో ఉప్పొంగి పోతున్నాయి. నేను కలిసిన వారిలో అత్యంత ప్రతిభావంతుడు, వినయశీలి, తెలివైన , దయగల వ్యక్తులలో ఆయన ఒకరు అని ప్రశంసించారు రేణు దేశాయ్.





