ఐఫోన్కు మారిన నిందితుడు
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తనయుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం. ఇప్పటికే 9 రోజుల తర్వాత తనను మర్యాద పూర్వకంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోసం సర్కార్ ప్రత్యేకంగా సిట్ వేసింది. ఆపై డీసీపీని ఉన్నతాధికారిగా నియమించింది. అంతే కాదు తనను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసింది. కానీ తనంతకు తానుగా లొంగి పోవడం, మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చడం, 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది.
ఇదిలా ఉండగా జైలులో ఉన్న బండి భగీరథ్ మామూలోడు కాదు. ఇప్పటికే సవాలక్ష అవలక్షణాలు కలిగి ఉన్నాడు. టెక్నాలజీ పరంగా అవగాహన ఉండడంతో కేసు నమోదైన వెంటనే ఐఫోన్కు మారాడు నిందితుడు. ఆ ఫోన్లోని కీలక ఆధారాలు మాయం చేసినట్లు సమాచారం. దీంతో వివరాల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు. ఆధారాలను ధ్వంసం చేయడానికి వంద రెట్లు శక్తివంతమైన సాంకేతికతను వినియోగించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగతోంది. ఆధారాల నాశనంలో తెర వెనుక ఉన్న సూత్రధారులపై దృష్టి సారించారని, ఇదే క్రమంలో బాధితురాలి ఫోన్ ద్వారా ఆధారాలు సేకరించేందుకు ఛాన్స్ ఉన్నట్టు గుర్తించారు.





