ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ కు జ‌ర్న‌లిస్టుల జాబితా

Spread the love

అంద‌జేసిన జేసీహెచ్ఎస్ఎల్ ప్రెసిడెంట్ , స‌భ్యులు

హైద‌రాబాద్ : గ‌త కొంత కాలంగా జ‌ర్నలిస్టుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు పేరుకు పోయాయి. ఎన్ని ప్ర‌భుత్వాలు వ‌చ్చినా స్థ‌లాలు ఇస్తామ‌ని, ఇళ్లు కేటాయిస్తామ‌ని చెబుతూ వ‌చ్చారే త‌ప్పా ఆచ‌ర‌ణ‌లో అమ‌లు కాలేదు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల ప్ర‌భుత్వం పూర్తిగా జ‌ర్న‌లిస్టుల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు రాష్ట్రంలో ఉన్న జ‌ర్న‌లిస్టు సంఘాల‌న్నీ త‌మ త‌మ సంస్థ‌ల్లో ఉన్న జ‌ర్న‌లిస్టుల వివ‌రాల‌తో కూడిన జాబితాను త‌మ‌కు అంద‌జేయాల‌ని కోరింది. ఈ మేర‌కు జ‌ర్న‌లిస్ట్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (జేసీహెచ్ఎస్ఎల్) సోమ‌వారం స‌భ్యుల పూర్తి జాబితాను ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డికి అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో జ‌ర్న‌లిస్టు సంస్థ‌ అధ్యక్షుడు బ్ర‌హ్మాండ‌గిరి గోపరాజు, కార్యదర్శి రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జాయింట్ సెక్రటరీ డా. చల్లా భాగ్యలక్ష్మి, కోశాధికారి భీమగాని మహేశ్వర్, మాజీ కార్యదర్శి, ఎంసీ సభ్యులు హష్మీ, మేనేజింగ్ కమిటీ సభ్యులు కమలాకరా చార్య పాల్గొన్నారు. కాగా అంద‌జేసిన‌ జాబితాను ప్రభుత్వానికి అందజేస్తాన‌ని శ్రీనివాస్ రెడ్డి ఈ సంద‌ర్భంగా తెలిపార‌ని చెప్పారు ప్రెసిడెంట్ గోప‌రాజు. చెప్పిన సమయానికి జాబితా అందజేసిన మేనేజింగ్ కమిటీ సభ్యులను ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అభినందించిన‌ట్లు పేర్కొన్నారు.

  • Related Posts

    ప్ర‌ధాని మోదీకి 31వ అంతర్జాతీయ గుర్తింపు

    Spread the love

    Spread the loveస్వీడ‌న్ దేశం అత్యున్న‌త పౌర పుర‌స్కారం న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీకి స్వీడన్ అందించిన ఈ గౌరవం 31వ అంతర్జాతీయ పురస్కారం కావ‌డం విశేషం. గత కొన్నేళ్లుగా, భారతదేశం విస్తరిస్తున్న దౌత్య సంబంధాలు,…

    బండి సాయి భగీరథ ఫోన్ డేటా తొలగింపు..?

    Spread the love

    Spread the loveఐఫోన్‌కు మారిన నిందితుడు హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ త‌న‌యుడు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు వ్య‌వ‌హారం. ఇప్ప‌టికే 9 రోజుల త‌ర్వాత త‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *