ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు న‌మోదు

Spread the love

ఓ టీవీ ఛానెల్‌పై కూడా కేసు ఫైల్

అమ‌రావ‌తి : మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ , అన‌లిస్ట్ నాగేశ్వ‌ర్ రావుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న తాజాగా ఓ టీవీ ఛాన‌ల్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు న‌మోదు చేశారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్‌లో జనసేన ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు పోలీసులు. ఇదిలా ఉండ‌గా టీవీ ఛాన‌ల్ లో కీల‌క అంశంపై డిబేట్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్. త‌న‌కు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం వ‌చ్చింద‌ని, ప్ర‌ధానంగా ఆయ‌న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జ‌న‌సేన పార్టీ కోర్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింద‌ని, ఈ త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీకి వెళ్లార‌ని, త‌న‌తో పాటు నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా దేశ రాజ‌ధానికి వెళ్లార‌ని ఆ స‌మ‌యంలో త‌మ‌పై తీవ్ర ఒత్తిడి వ‌చ్చింద‌ని, జ‌గ‌న్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరార‌ని అన్నార‌ని తెలిపారు. చంద్ర‌బాబుతో తాత్కాలిక సంబంధం ఉంటుంద‌ని, కానీ జ‌గ‌న్ రెడ్డితో లాంగ్ టర్మ్ రిలేష‌న్ షిప్ ఉంద‌ని ఆ విష‌యం త‌న‌కు తెలిసింద‌న్నారు. దీంతో త‌న‌పై ఫిర్యాదు చేశారు జ‌న‌సైనికులు.

  • Related Posts

    కొలువు తీరిన త‌మిళ‌నాడు కొత్త కేబినెట్

    Spread the love

    Spread the loveఅన్ని సామాజిక వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్య‌త చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గురువారం మ‌రో 23 మందికి నూత‌న కేబినెట్…

    ఎయిర్ ఇండియా విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం

    Spread the love

    Spread the loveల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్ వేను తాకిన ఫ్లైట్ తోక బెంగ‌ళూరు : ఏమైందో ఏమో కానీ ఎయిర్ ఇండియా విమానాలు త‌రచూ ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి. తాజాగా గురువారం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో విమానం తోక రన్‌వేను తాకడంతో ఎయిర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *