జూన్ 5న దివ్య పుష్ప యాగ మ‌హోత్స‌వం

Spread the love

శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆల‌యంలో

తిరుపతి : నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయంలో జూన్ 5వ తేదీన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం పుష్ప సుగంధాలతో, భక్తిరస వాతావరణంతో ఆధ్యాత్మిక కాంతిని సంతరించు కోనుంది. ఇందుకోసం జూన్ 4వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుండి రాత్రి 7.45 గంటల వరకు పుణ్యాహ వచనం, రక్షా బంధనం, మృత్సంగ్రాహణం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగ అంకురార్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

జూన్ 5న ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం జరగనుండగా, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తి శ్రద్ధల మధ్య పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో వివిధ రకాల సుగంధ పుష్పాలు, పవిత్ర పత్రాలతో స్వామివారికి విశేష అభిషేకాలు సమర్పిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి వీధి ఉత్సవం భక్తులను అలరించనుంది.

గృహస్తులు ఇద్దరు కలిసి రూ.750/- టికెట్‌ ద్వారా పుష్పయాగ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆలయంలో మే 1 నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల సందర్భంగా అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన ఏవైనా లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు వెల్లడించారు.

  • Related Posts

    మ‌హిమాన్విత క్షేత్రం ఉత్స‌వాల వైభ‌వం

    Spread the love

    Spread the loveమే 23 నుంచి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు మే 23 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక క్షేత్రనికి ఘ‌న‌మైన చ‌రిత్ర…

    యాద‌గిరిగుట్ట‌లో వేద పాఠ‌శాల‌కు శంకుస్థాప‌న

    Spread the love

    Spread the loveప్రారంభించ‌నున్న సీఎం అనుముల రేవంత్ రెడ్డి యాదాద్రి, భువ‌న‌గిరి జిల్లా : యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కొండపైకి వెళ్లే మెట్లపై కప్పు ఏర్పాటు చేసే పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *