ప్ర‌త్య‌ర్థులపై దాడి చేయ‌డం పైనే ఫోక‌స్

Spread the love

యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ కామెంట్స్

అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు బీహార్ కు చెందిన యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను ఏకంగా 76 సిక్సులు కొట్టాడు. క‌గిసో ర‌బాడా, పాట్ కమిన్స్, భువేన‌శ్వ‌ర్ కుమార్, సిరాజ్ , ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ క్లాస్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌ను ప‌లుమార్లు సెంచ‌రీకి చేరువ‌లో వ‌చ్చి చేయ‌కుండానే పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. ఎలిమినేట‌ర్ -2 మ్యాచ్ లో త‌ను 96 ర‌న్స్ చేశాడు. ఇక ఫైన‌ల్ మ్యాచ్ లో తాము ఆర్సీబీతో ఆడుతామ‌ని అనుకున్నాన‌ని కానీ త‌మ ఆశ‌ల‌పై గుజ‌రాత్ టైటాన్స్ నీళ్లు చ‌ల్లింద‌న్నాడు. ఈ సంద‌ర్బంగా త‌ను కూడా అహ్మ‌దాబాద్ కు చేరుకున్నాడు ఫైన‌ల్ మ్యాచ్ చూశాడు.

మ్యాచ్ అనంత‌రం ఆర్సీబీ అద్భుత‌మైన ఆట‌తీరుతో ఐపీఎల్ 19 సీజ‌న్ విజేత‌గా నిలిచింది. ర‌న్ మెషీన్ మ‌రోసారి మెరిసాడు. త‌ను ఒక్కేడ 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో స‌త్తా చాటాడు. 75 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. ఈ సీజన్‌లో, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఎలా ఆడాలి, అలాగే సందర్భానికి అనుగుణంగా నా ఆట తీరును ఎలా మార్చుకోవాలి అనే విషయాలను నేను నేర్చుకున్నాను.ప్రతి మ్యాచ్‌నూ ఒకే రకమైన మనస్తత్వంతో ఆడలేమన్నాడు. మీరు ఆటలోని పరిస్థితిని అంచనా వేసి, జట్టుకు ఆ సమయంలో ఏది అవసరమో దానికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

  • Related Posts

    ఆశించిన రీతిలో ఆడ‌లేక పోయాం : గిల్

    Spread the love

    Spread the loveఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19 సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌లూరు చేతిలో ఓట‌మి పాల‌య్యాక స్పందించాడు గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్. టైటిల్…

    ఆర్సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ భావోద్వేగం

    Spread the love

    Spread the loveత‌న కెప్టెన్సీలో రెండోసారి ఆర్సీబీ ఐపీఎల్ కైవ‌సం అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 2026 విజేత‌గా నిలిచింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు . ఫైన‌ల్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సంద‌ర్బంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *