సంచలన ప్రకటన చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన ప్రకటన చేసింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం (PMLA), 2002′ నిబంధనల కింద, పంజాబ్లోని రామ్నగర్లో ఉన్న ‘జ్ఞాన్ సాగర్ ఎడ్యుకేషనల్ , ఛారిటబుల్ ట్రస్ట్’కు చెందిన 14 స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. బ్యాంక్ బాధ్యతలు (అప్పులు) మినహాయించి, ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ ₹1,595.85 కోట్లుగా ఉంది. M/s PACL Ltd దాని అనుబంధ సంస్థలు నిర్వహించిన సామూహిక పెట్టుబడి పథకానికి సంబంధించిన భారీ స్థాయి పెట్టుబడి మోసం ఆరోపణలపై ED కొనసాగిస్తున్న దర్యాప్తులో భాగంగా ఈ ఆస్తుల జప్తు జరిగింది.
ED తెలిపిన వివరాల ప్రకారం, PACL కుంభకోణం దర్యాప్తున కు సంబంధించి ఇప్పటి వరకు భారతదేశంలోనూ, విదేశాలలోనూ ఉన్న చరాస్తులు , స్థిరాస్తులతో కలిపి, సుమారు ₹28,626 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా మరో వైపు ట్రస్టు పేరుతో మోసం చేశారని, అత్యధికంగా నిధులను పొందారని ట్రస్ట్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఈడీ రంగంలోకి దిగింది. .





