తెలంగాణ మీ అయ్య జాగీరా..?

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

హైద‌రాబాద్ : జ‌న‌సేన పార్టీ చీఫ్‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి తెలంగాణ‌పై నోరు పారేసుకున్నారు. రెచ్చ‌గొట్టేలా మాట్లాడారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ప్ర‌శ్నించారు. దాడులు చేస్తారా అయితే ఇక్క‌డే ఉంటా ద‌మ్ముంటే రావాల‌ని స‌వాల్ విసిరారు .తెలంగాణపై కమిట్మెంట్ ఉంది కాబట్టే కొండగట్టు అంజన్నకు ముప్పై కోట్లు ఇచ్చానని అన్నారు. అడ్డుకుంటారా..? నేనే తిరుగుతా ఇక్కడ అంతటా..! ఇప్పుడు డిసైడ్ అయ్యాన‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం అని మీరెవరు అడ్డుకోవడానికి అని నిల‌దీశారు.

తెలంగాణా లో జనసేన ఉంటుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎలా తిరుగుతావ్ తెలంగాణలో అంటున్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో ఇలాగే అన్నారు అప్పట్లో అని గుర్తు చేశారు. ఇక్కడ భయపడేవాడు ఎవ్వరూ లేరన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇది నా దేశం నేను ఎక్కడైనా అడుగు పెట్టేందుకు హ‌క్కు ఉంద‌న్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కేరళం లో , వయనాడు లో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ మెదక్ లో పోటీ చేయొచ్చు. మేము వస్తె అడ్డుకుంటారా అని అన్నారు. కాంగ్రెస్ కు ఒక పద్ధతి ఉందా.. ఏం మాట్లాడుతున్నారు మీరు. నేను చెరువును కబ్జా చేశానా..అలా కబ్జా చేసి ఉంటే విడిచిపెట్టే వాళ్లా అని నిల‌దీశారు.

  • Related Posts

    నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు

    హైద‌రాబాద్ : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేద‌న్నారు. త‌నపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…

    నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేస్తాం

    హైద‌రాబాద్ : టీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. కేవ‌లం గ‌త కొంత కాలం నుంచి పార్టీ కోసం నిస్వార్థంగా, నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసిన పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *