కూట‌మి నేత‌ల‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని..?

నిప్పులు చెరిగిన శాస‌న మండ‌లి చైర్మ‌న్

హైద‌రాబాద్ : ఏపీ కూట‌మి నేత‌లు నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, నారా లోకేష్ , త‌దిత‌ర నేత‌ల తీరుప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఉండాల్సిన కూట‌మి నేత‌ల‌కు ఇక్క‌డ ఏం ప‌ని అని నిల‌దీశారు. హైద‌రాబాద్ లో కాదు ఉండాల్సింది మీరు వెళ్లాల్సింది, అమ‌రావతి మీ ప్రాంత‌మ‌ని అక్క‌డే ఉండాల‌ని ఇక్క‌డికి వ‌చ్చి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తామంటే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు.

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు పారేసు కోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకునే ర‌కం కాద‌ని, అది తెలుసుకుంటే మంచిద‌న్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహారంపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియ‌స్ గా స్పందించారు. నిప్పులు చెరిగారు త‌న కామెంట్స్ పై. ఆంధ్ర నాయకులు ఏపీ, తెలంగాణల మధ్య తరచూ రాకపోకలు సాగించడం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. వారు తెలంగాణను పక్కన పెట్టి, ఏపీ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి.

  • Related Posts

    ప్రాజెక్టుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయాలి

    ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, దిండి ప్రాజెక్టులకు తక్షణమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రాష్ట్ర నీటిపారుదల…

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *